
ముంబై: శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా నియమితులయ్యాడు. న్యూజిలాండ్ గ్రేట్ షేన్ బాండ్ పదవీకాలం ముగియడంతో.. మలింగకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ముంబై ఫ్రాంఛైజీ శుక్రవారం ప్రకటించింది. 2008 నుంచి 11 సీజన్లు ప్లేయర్గా ముంబై కి ఆడిన మలింగ ఆ టీమ్ 4 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు బౌలింగ్ కోచ్గా సేవలు అందించననున్నాడు. మార్క్ బౌచర్, పోలార్డ్తో కూడిన కోచింగ్ స్టాఫ్తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని మలింగ చెప్పాడు.