4న అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ సభ : బైరి వెంకటేశం

4న అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ సభ : బైరి వెంకటేశం
  • గెస్టులుగా అంబేద్కర్, కుమ్రం భీమ్​ మనమళ్లు

హైదరాబాద్, వెలుగు : దళిత ఉప కులాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అక్టోబ‌‌‌‌ర్ 4న ‘అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ సభ’ నిర్వహించనున్నట్లు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స‌‌‌‌భ‌‌‌‌కు ముఖ్య అతిథిగా బీఆర్​ అంబేద్కర్​ మనమడు ప్రకాశ్​ అంబేద్కర్, గౌర‌‌‌‌వ అతిథిగా కుమ్రం భీమ్ మనమడు కుమ్రం సోనేరావు భీమ్​ వ‌‌‌‌స్తున్నార‌‌‌‌ని తెలిపారు.

హైద‌‌‌‌రాబాద్ దోబీఘాట్ గ్రౌండ్‌‌‌‌లో సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ బ‌‌‌‌హిరంగ స‌‌‌‌భ‌‌‌‌కు రాష్ట్రంలోని అన్ని ద‌‌‌‌ళిత ఉప‌‌‌‌కులాల ప్రజలు హాజరు కావాల‌‌‌‌ని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయ‌‌‌‌కులు, జాతీయ గిరిజన పరిశోధకులు త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.