హైదరాబాద్, వెలుగు: రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మొదటి రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఆదివారం పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా చింతకుంటలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ జిల్లా కేశవరంలో 2.7, వికారాబాద్ జిల్లా యాలాల్లో 2.3, పరిగిలో 1.8, పెద్దేముల్లో 1.8, ఖమ్మంలో 1.7, ధారూరులో 1.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.
ALSO READ :మరో 19 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.. నేషనల్ సెమినార్లో వక్తలు