ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యం

ఈనెల 13 నుంచి ఆచూకీ లేదు
కనిపించకుండా పోయిన
శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్ వ్యాపారి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కనిపించకుండాపోయారు. చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం చేసే వెల్ముల శ్రీనివాస్ రెడ్డి (43), అతని భార్య అనిత , పిల్లలు తరుణిక(11), యమున చంద్రిక(7) జ్యోతి నగర్ లో ఉంటున్నారు. వీరు ఈనెల 13 నుంచి వారు కనిపించడం లేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఉండే శ్రీనివాస్ రెడ్డి అన్న వెల్ముల నిరంజన్ రెడ్డి ఈ మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొమ్మిది రోజులుగా తన తమ్ముడి జాడ లేక పోవడంతో తెలిసిన వారిళ్ల‌లోనూ, బంధువుల ఇళ్ల‌లోనూ వెతికారు. అయినా వారి జాడ తెలియలేదని, ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎక్కడి కైనా టూర్ల‌కు వెళ్లినట్లు కూడా సమాచారం లేదన్నారు.

కరోనా నేపథ్యంలో ఎక్కడికీ వెళ్ల‌లేర‌ని అంటున్నారు. వారు ఎటు వెళ్లారు, ఏమయ్యారన్నది సస్పెన్సుగా మారింది. కరీంనగర్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మృతి మిస్టరీ వీడిన రోజే మరో కుటుంబం అదృశ్యమయినట్టు కేసు నమోదు కావడం కరీంనగర్ పోలీసులకు సవాలుగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ లక్ష్మణ్‍ బాబు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం