
గుంటూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో మిర్చి లారీ బోల్తా పడిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.