నలుగురు సైనికుల సజీవ దహనం

నలుగురు సైనికుల సజీవ దహనం

జమ్ము కశ్మీర్ పూంచ్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ- పూంచ్ హైవే.. పూంచ్ సెక్టార్ లో జవాన్లు వెళ్తున్న వాహనంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. ఏప్రిల్ 20వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగటం.. అందులోని నలుగురు జవాన్లు ఎలా సజీవ దహనం అయ్యారనేది సంచలనంగా మారింది. 

నలుగురు సైనికులు సజీవ దహనంపై ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. కారణాలు ఏంటీ అనే విషయాలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల బృందం ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేయాలని కేంద్ర రక్షణ శాఖ ఆదేశించింది.