బొగ్గుగని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి

 బొగ్గుగని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి

మంచిర్యాల జిల్లా ఎస్ ఆర్ పీ బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది.. రూఫ్ వాల్ కూలి నలుగురు కార్మికులు చనిపోయారు. భూగర్భ గనిలో పనిచేస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికులు కృష్ణారెడ్డి(59), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్‌ (29), నర్సింహరాజు(30) మృతి చెందారు. 21వ క్రాస్ దగ్గర కార్మికులపై పెద్ద బండరాయి పడిందని అధికారులు అంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృత దేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి.