
రాజకీయ నాయకుల భార్యలు కొంతమంది ఇంటికే పరిమితం అయితే.. మరికొంతమంది మాత్రం తమ భర్తల పొలిటికల్ కెరీర్ లో కీరోల్ ప్లే చేస్తుంటారు. మరికొంతమంది తమకంటూ ఒక కేరీర్ ఎంచుకొని అందులో రాణిస్తుంటారు. ఈ బీజేపీ ఎమ్మెల్యే భార్య కూడా ఈ కోవకు చెందిన మహిళనే.. బీహార్ లోని తరారికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య.. ఐశ్వర్య రాజ్ మిసెస్ బీహార్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు . ఎమ్మెల్యే భార్య, మాజీ ఎమ్మెల్యే కోడలు అయిన ఐశ్వర్య రాజ్ ఇటీవల జరిగిన మిసెస్ బీహార్ 2025 పోటీల్లో గెలుపొందారు.
మిసెస్ బీహార్ పోటీల్లో గెలుపొందిన సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు ఐశ్వర్య రాజ్, “కలల నుండి వాస్తవికతకు మీ అమ్మాయి ఇప్పుడు మిసెస్ బీహార్ 2025!” అంటూ ఆమె తన కుటుంబానికి, ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ షేర్ చేశారు. “ఈ కిరీటం కలలు కనే ధైర్యం చేసే ప్రతి మహిళ కోసం” అనే కాప్షన్ తో ఇంస్టాగ్రాం లో పోస్ట్ చేశారు ఐశ్వర్య రాజ్.
ఇన్స్టాగ్రామ్లో 28,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఐశ్వర్య, అందం, ఫ్యాషన్, ప్రయాణం మరియు మాతృత్వంపై తన కంటెంట్ ను షేర్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఒకప్పుడు మోడలింగ్, సినిమాల్లో కెరీర్ పట్ల ఆసక్తి చూపించిన ఆమె, పెళ్లి తర్వాత ఆసక్తిని విరమించుకున్నట్లు తెలిపారు. తన భర్త ప్రోత్సాహంతో, ఇప్పుడు తన కలలను తిరిగి పొందుతున్నానని తెలిపారు ఐశ్వర్య రాజ్.