న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు భారతీయ ఈక్విటీలపై ఇష్టం పెరుగుతోంది. ఇక నుంచి దూకుడుగా వడ్డీ రేట్ల పెంపు ఉండదని, మాక్రో ఎకానమీ బాగుంటుందనే నమ్మకంతో ఈ నెలలో ఇప్పటివరకు స్టాక్మార్కెట్లో రూ. 31,630 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో వీళ్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ముందు మాత్రం ఇలా చేసే అవకాశం లేదని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ధరల భారం తగ్గడం, అమెరికా ఎకానమీ బాగుండటం, ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం కూడా ఎఫ్పీఐ ఇన్ఫ్లోలను నడిపిస్తున్నాయి. డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, నవంబర్ 1-–25 మధ్య కాలంలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 31,630 కోట్ల నికర మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాయి. అక్టోబర్, సెప్టెంబరులో వరుసగా రూ. 8 కోట్లు రూ. 7,624 కోట్ల ఇన్ఫ్లో ఉంది. ఆగస్టులో ఎఫ్పీఐలు 51,200 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. జూలైలో దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
డాలర్ విలువ బాగా పెరగడంతో ఎఫ్పీఐలు 2021 అక్టోబర్ నుంచి వరుసగా తొమ్మిది నెలల పాటు పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా ఎఫ్పీఐ ఇన్ఫ్లోలు సమీప కాలంలో అస్థిరంగానే ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్పీఐల మొత్తం ఔట్ఫ్లో రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది. గ్లోబల్ కౌంటర్లతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థతో పాటు రూపాయి బాగుండటం వల్ల నవంబర్లో ఇన్ఫ్లోలు పెరిగాయని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. బుల్లిష్ మార్కెట్ సెంటిమెంట్లు బలంగా ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు నవంబర్ 25 న రెండవ వరుస సెషన్లో లైఫ్టైమ్ హైలకు వెళ్లాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్లో ఎఫ్పీఐ కొనుగోళ్లు
కనిపించాయి.