- రాజస్థాన్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో ఘటన
న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని బీఎస్ఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. ఓ జవాను గన్ తో ఇన్ స్పెక్టర్ కాల్చి చంపి.. ఆపై తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలను బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ లోని శ్రీగంగనగర్ జిల్లా బోర్డర్ అవుట్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న 125 బెటాలియన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శివ చందర్ రావు.. తన సీనియర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పీ సింగ్ను సర్వీస్ గన్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్తో తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఘటనకు కారణాన్ని తెలుసుకోవడానికి సీనియర్ అధికారులు స్పాట్ ను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.