హెచ్ఎండీఏ ప్లాట్ల పేరుతో మోసం.. 120 మందికి లక్షల్లో లాస్..

హెచ్ఎండీఏ ప్లాట్ల పేరుతో మోసం.. 120 మందికి లక్షల్లో లాస్..
  • స్పందించి న్యాయం చేయండి 
  • స్ప్రింగ్ ​సిటీ మూడో ఫేజ్ వెల్ఫేర్​ అసోసియేషన్​ వినతి

హైదరాబాద్​సిటీ, వెలుగు: తాము కొన్న వెంచర్​ను పూర్తిగా అభివృద్ధి చేయని సంస్థపై చర్యలు తీసుకుని, వెంచర్​కు ఫైల్​అప్రూవ్​ఇప్పించాలని స్ప్రింగ్ సిటీ మూడో ఫేజ్​వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ఆర్​ కే ప్రసాద్​ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రెరాకు కూడా ఫిర్యాదు చేశారు. 2018 లో స్ప్రింగ్ సిటీ పేరుతో అమీన్ పూర్​మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వే నంబర్ 434,435,436,437,438,449,444,446లోని 20 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లు​ అంటూ వీఎన్​కన్​స్ట్రక్షన్స్​వెంచర్​వేసి ప్లాట్స్ అమ్మారని, సాండ్ స్టోన్ అనే సంస్థ ద్వారా మార్కెటింగ్​చేశారన్నారు. 

2018లో తామంతా రూ. లక్షలు వెచ్చించి ప్లాట్స్ కొన్నామన్నారు. ఎల్​పీ నంబర్ పై ప్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇప్పటివరకు వాటిని డెవలప్​చేయలేదన్నారు. చాలా సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఈ వెంచర్ లో ఉన్న పార్కు కూడా ఆక్రమణకు గురవుతోందని, 120 మంది ప్లాట్ ఓనర్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే  డెవలపర్, మార్కెటింగ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.