ఉస్మానియా హాస్పిటల్​లో ఫ్రీగా జెండర్ మార్పిడి సర్జరీలు

ఉస్మానియా హాస్పిటల్​లో  ఫ్రీగా జెండర్ మార్పిడి సర్జరీలు
  • ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కింద ఉచితం
  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయం
  • మొత్తం 22 తీర్మానాలు చేసిన బోర్డు

హైదరాబాద్, వెలుగు :  ఆయుష్మాన్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరోగ్య శ్రీ కింద ఉస్మానియా హాస్పిటల్​లో సెక్స్ మార్పిడి సర్జరీలు ఫ్రీగా చేయనున్నారు. ఈ తరహా సర్జరీలు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేస్తున్నారు. ఇటీవలే ఆయుష్మాన్ కింద సెక్స్ మార్పిడీ  సర్జరీలను తీసుకొచ్చారు. దీంతో మన రాష్ట్రంలో ఉస్మానియాలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని బోర్డు తీర్మానించింది. ప్రస్తుతం ఉస్మానియాలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల  కోసం ప్రత్యేకంగా ఓ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్వహిస్తుండగా, ఈ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. సెక్స్ మార్పిడిలో 50 రకాల సర్జరీలు ఉండగా, అన్నింటినీ ఉస్మానియాలో చేయించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉస్మానియాలో అన్ని రకాల సర్జన్లతో పాటు  వసతులు ఉండడంతో ఆ ఒక్క హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఈ సర్జరీలను పరిమితం చేయాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు నేతృత్వంలో సోమవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు తీర్మానం చేసింది. దీంతో పాటు మొత్తం 22 తీర్మానాలు చేసింది. ఆర్థోపెడిక్, పాలిట్రామా(మల్టీపుల్ ఇంజూరీ కేసులు, సూసైడ్స్ వంటివి) సంబంధిత పేషెంట్లకు ఇకపై ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ రెండు స్పెషాలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ దవాఖాన్లు, ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ఎంప్యానల్ అయి ఉన్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఈ సేవలను నిలిపివేస్తారా.. లేదా.. అన్నదానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు కొత్త హాస్పిటళ్లకు పర్మిషన్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.

పలు తీర్మానాలకు ఆమోదం

కోవిడ్ టైమ్​లో మ్యూకో మైక్రోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించిన డాక్టర్లకు ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని తీర్మానించింది. నైప్రో డయాలసిస్ మిషన్ల పనితీరుపై నిమ్స్ డాక్టర్లతో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించాలని, ప్రభుత్వ దవాఖాన్లలో అటెండెన్స్ కోసం ఫేస్ అథెంటికేషన్ మిషన్లను తొలుత నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వాటి పనితీరుపై అధ్యయనం చేయాలని తీర్మానించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల వయో పరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కార్మికులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసేందుకు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని తీర్మానించారు.