చేవెళ్ల వాసులకు ఫ్రీగా గుండె, కంటి ఆపరేషన్లు: ఎంపీ రంజిత్రెడ్డి

చేవెళ్ల వాసులకు ఫ్రీగా గుండె, కంటి ఆపరేషన్లు: ఎంపీ రంజిత్రెడ్డి

శంకర్​పల్లి, వెలుగు: చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ వాసులకు ఉచితంగా గుండె, కంటి ఆపరేషన్లు చేయిస్తానని ఎంపీ రంజిత్రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ ఆరోగ్య రథం ప్రతి గ్రామంలో పర్యటిస్తుందన్నారు. గుండె, కంటి సమస్యలున్న వారిని గుర్తించి సిటీలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.