బెంగళూరు: కర్నాటకలో అధికార కాంగ్రెస్ప్రభుత్వం శక్తి స్కీమ్ కింద మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రభుత్వ నాన్ లగ్జరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శక్తి పథకం అమలు చేసేందుకు ఒకరోజుకు అయిన ఖర్చు వివరాలను ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే రూ.8.84 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది.
ఈ క్రమంలో కేవలం రెండురోజుల్లోనే డిపార్ట్మెంట్కు రూ.1.40కోట్లు వ్యయమైందని కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు అధికారులు తెలిపారు. సోమవారం గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే శక్తి పథకం వార్షిక వ్యయం రూ. 3,200 కోట్ల నుంచి రూ. 3,400 కోట్ల మధ్య ఉండవచ్చని రవాణా అధికారి మీడియాకు తెలిపారు.