వాక్ స్వాతంత్ర్యం ఉందని..హద్దులు దాటొద్దు: రాహుల్​ గాంధీకి హైకోర్టు హెచ్చరిక

వాక్ స్వాతంత్ర్యం ఉందని..హద్దులు దాటొద్దు: రాహుల్​ గాంధీకి హైకోర్టు హెచ్చరిక

ప్రయాగ్ రాజ్: వాక్​ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి హద్దులు దాటేలా మాట్లాడొద్దని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీని అలహాబాద్​ హైకోర్టు హెచ్చరించింది. సైన్యాన్ని కించపరిచేలా, పరువుకు భంగం కలించేలా వ్యాఖ్యానించడం ఏ మాత్రం మంచిది కాదని హితవుపలికింది. 

2022లో భారత్​ జోడో యాత్ర సందర్భంగా రాహుల్​.. ‘‘చైనా సోల్జర్లు మన భూభాగంలోకి చొరబడి మన జవాన్లను కొడ్తున్నారు. 20 మందిని చంపేశారు” అని అన్నారు. దీనిపై బీఆర్​వో మాజీ డైరెక్టర్​ ఉదయ్​ శంకర్​ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.