
ప్రయాగ్ రాజ్: వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి హద్దులు దాటేలా మాట్లాడొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అలహాబాద్ హైకోర్టు హెచ్చరించింది. సైన్యాన్ని కించపరిచేలా, పరువుకు భంగం కలించేలా వ్యాఖ్యానించడం ఏ మాత్రం మంచిది కాదని హితవుపలికింది.
2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్.. ‘‘చైనా సోల్జర్లు మన భూభాగంలోకి చొరబడి మన జవాన్లను కొడ్తున్నారు. 20 మందిని చంపేశారు” అని అన్నారు. దీనిపై బీఆర్వో మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.