సాత్విక్‌‌‌‌ జోడీపైనే ఫోకస్‌‌

సాత్విక్‌‌‌‌ జోడీపైనే ఫోకస్‌‌

నేటి నుంచి హైలో ఓపెన్‌‌

సార్బ్రూకెన్ (జర్మనీ):  ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌ సిరీస్‌‌ విన్నర్స్‌‌ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌, చిరాగ్‌‌ షెట్టి మరో సవాల్‌‌కు రెడీ అయ్యారు. మంగళవారం మొదలయ్యే హైలో ఓపెన్‌‌ సూపర్‌‌ 300 టోర్నమెంట్‌‌లో  ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ జోరును కొనసాగించి ఈ టోర్నీ మెన్స్‌‌ డబుల్స్‌‌లోనూ టైటిల్‌‌ నెగ్గాలని ఆశిస్తున్నారు.  సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి ఉంది. మూడో సీడ్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ తొలి రౌండ్‌‌లో చైనీస్‌‌ తైపీకి చెందిన లీ యంగ్‌‌–లు చెన్‌‌తో తలపడతారు. మరోవైపు మెన్స్‌‌ సింగిల్స్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ బరిలో నిలిచారు.  విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో వెటరన్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌  వరుస ఫెయిల్యూర్స్‌‌ నుంచి గట్టెక్కాలని ఆశిస్తోంది.

షట్లర్లకు బాయ్‌‌ నజరానా

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ లో  విజేతలుగా నిలిచిన సాత్విక్‌‌, చిరాగ్​, బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ జూనియర్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సిల్వర్‌‌ నెగ్గిన శంకర్‌‌ ముత్తుస్వామికి బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా తలో  రూ. 5 లక్షల క్యాష్​ ప్రైజ్​ ప్రకటించింది.