
రాజ రాజ చోర తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. గురువారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘సింగరో సింగ’ అంటూ సాగిన ఈ పాటను వివేక్ సాగర్ కంపోజ్ చేయగా బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఎనర్జిటిక్గా పాడారు. నిక్లేష్ సుంకోజీ లిరిక్స్ రాశాడు.
ఈ పాటతో సోషల్ మీడియా సెన్సేషన్, వైరల్ కింగ్ సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.