విద్యార్థుల బ్రేక్​ఫాస్ట్​లో కప్ప

 విద్యార్థుల బ్రేక్​ఫాస్ట్​లో కప్ప

పరిగి, వెలుగు:  వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో గురువారం విద్యార్థులకు పెట్టిన పొంగల్​(బ్రేక్​ఫాస్ట్)​లో కప్ప వచ్చింది. గమనించిన వంట సిబ్బంది వెంటనే పొంగల్​ను పారబోశారు. అప్పటికే అది​తిన్న 45 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురై  వాంతులు చేసుకున్నారు. నలుగురిని హాస్పిటల్​కు తరలించారు. ఈ గురుకులంలో 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో తహశీల్దార్​రాంబాబు స్కూల్​ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వంట సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపాల్​వేణుగోపాల్​ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు హాస్టల్​ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.