ఓయూ గెస్ట్ హౌజ్​లో  రూ.100కే లంచ్

ఓయూ గెస్ట్ హౌజ్​లో  రూ.100కే లంచ్

వచ్చే నెల 1 నుంచి ప్రారంభం
ఓయూ, వెలుగు: వివిధ పనులపై డైలీ వందల మంది స్టూడెంట్లు, అనుబంధ కాలేజీల ఫ్యాకల్టీ ఓయూకు వస్తుంటారు. క్యాంపస్​లో  క్యాంటీన్ లేక వీరంతా మధ్యాహ్నం లంచ్ కోసం క్యాంపస్ చుట్టుపక్కల ప్రాంతాలైన తార్నాక, హబ్సిగూడకు వెళ్తుంటారు. వీరి ఇబ్బందులను గుర్తించిన అధికారులు వర్సిటీకి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా రూ.100కే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించారు. ఓయూ గెస్ట్ హౌస్ దగ్గర వచ్చే నెల 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.