సలాం పోలీస్ : ప్రాణాల్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

సలాం పోలీస్ : ప్రాణాల్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

లాక్ డౌన్ ను  పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు రేయింబవళ్లుకష్ట పడుతున్నారు. కరోనా దడపుట్టిస్తున్నా .. ఏ మాత్రం బెదరకుండా ప్రజా సేవలో నిమ గ్నమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లమీదికి రాకుండాప్రతిచౌరస్తా లోగస్తీ కాస్తున్నారు. కరోనాపై అవగాహన కలిపిస్తున్నారు. పెట్రోలిం గ్ వెహికల్స్ ను అంబులెన్స్ లుగా మార్చి పేషెంట్లను తరలి స్తున్నారు. రూల్స్ పాటించని వారిపై కేసులు పెడుతున్నారు.వారాలకు వారాలు ఇండ్లకు వెళ్లకుండా, కుటుంబాలకు దూరమై డ్యూ టీలోనే పోలీసులు నిమగ్నమవుతున్నారు. రోడ్లపైనే తింటూ, ఫుట్‌పాత్‌లపైనే సేద తీరుతున్నారు. 18 రోజులుగా.. కరోనా వైరస్ కట్టడి  కోసం మార్చి 22న దే శవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు. ఆ తర్వాత లాక్డౌన్ అమలులోకి వచ్చింది. జనతా కర్ఫ్యూ నుంచి అంటే 18 రోజులుగా పోలీసులు రోడ్లపైనే డ్యూటీలు చేస్తున్నారు.

ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలను ప్రజలు పాటించేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డ్స్.. అంతా లాక్ డౌన్ విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తో పాటు పట్టణాలు, పల్లెల్లో కరోనా కట్టడి కోసం వాళ్లు రోడ్లపై డ్యూటీ చేస్తున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నా రు. ఇండ్లు విడిచి జనం బయటికి రాకుండా చూస్తు న్నారు. కరోనా వైరస్ నుంచి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా.. గతంలో పోలీసుల ముందు ఎన్నో సవాళ్లు నిలిచాయి. పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి. విపత్తులు వచ్చిప డ్డాయి. వందలు వేలాది ఆందోళనలు చోటుచేసుకు న్నాయి. అయినా ఆ డ్యూటీలకు, ఇప్పుడు నిర్వహి స్తున్న లాక్ డౌన్ డ్యూటీకి ఎంతో తేడా ఉంది. లాక్ డౌన్ డ్యూటీ పోలీసులకు కొత్తపాఠాలు నేర్పుతోం ది. టైమ్, షిఫ్ట్‌, రోజులతో సంబంధం లేకుండా వారిని గంట గంటలు, రోజులకు రోజులు రోడ్ల కే పరిమితం చేస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా కట్టడి కోసం పనిచేయాల్సి వస్తోంది. తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా  పెట్టాల్సివస్తోంది. లాక్ డౌన్ అమ ల్లోకి వచ్చిన నాటి నుంచి చెక్ పోస్టులు, పెట్రోలిం గ్ వెహికల్స్,  ఫుట్ పాత్ లు  రోడ్ల మీది చెట్లే ఇపుడు వారికి రెస్ట్ రూమ్ లుగా  మారాయి. ఆపదలో ఉన్నవారికి పోలీసులే భరోసాగా నిలుస్తున్నారు. వలస కూలీలకు షెల్ట ర్స్, ఫుడ్ అందిస్తున్నా రు. పేషెంట్లకు మందులు, ఎమర్జెన్సీలో ఉన్న వాళకు అంబులెన్స్‌ సేవలు అందిస్తూ తామే రెస్క్యూ టీమ్‌లుగా మారుతున్నా రు. ఇంటికి వెళ్తే సోషల్ డిస్టెన్స్ వైరస్ క్యారియర్లుగా మారకుండా, తమ కుటుంబా లకు అది సోకకుండా జాగ్రత్తపడే క్రమంలో కొందరు పోలీసులు ఇండ్లకు వెళ్లడం మానేశారు. మరికొందరు ఇంటికి వెళ్లాల్సి వస్తే బయటి నుంచి బయటికే వచ్చేస్తు న్నారు. ఇంట్లో వాళ్లతో  సోషల్ డిస్టె న్స్ పాటిస్తున్నా రు. దూరం నుంచే పలకరించి వచ్చేస్తున్నారు. లాక్ డౌన్ యాక్షన్ రాష్ట్ర బోర్డర్ లో  ఏర్పాటు చేసిన 50 చెక్ పోస్టులతో పాటు జిల్లాలు, మండల కేంద్రాల్లో చెక్ పోస్టులు, పికెటింగ్స్ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. హైదరా బాద్, కరీంనగర్ తో పాటు కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన జిల్లా కేంద్రా ల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఉదయం పూట మార్కెట్లకు నిత్యావసరాల కోసం వచ్చే జనం గుమి గూడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  ఇందుకోసం మైకులతో ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల కలిగే అనర్థాలతో పాటు నివారణా చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ ధంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా రు.

అనుమానితులను ట్రేస్ చేస్తూ..

డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు అన్ని విభాగాల డీజీల నుంచి లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కరోనా వైరస్ అనుమానితులను ఇండ్లలోకి వెళ్లి హాస్పిటల్స్ కు  తరలిస్తు న్నారు. వారిని హాస్పిటల్స్ కు  తరలించే సమయాల్లో తమపై వైరస్ ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నా ఏ మాత్రం బెదరడం లేదు.

కరోనా వేళ..

అప్రమత్తం చెక్ పోస్ట్ ల వద్ద డ్యూటీ చేస్తు న్న సిబ్బంది వాహనదారులతో మాట్లా డే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించే టైమ్ లో అప్రమత్తంగా ఉంటున్నారు. ఇందుకోసం సిబ్బందికి అవసరమైనన్ని మాస్క్ లు,శానిటైజర్స్ ను డిపార్ట్ మెంట్ అందిస్తోంది. రోజూ కొత్త మాస్క్ లను వాడేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

కుటుంబాలూ సపోర్ట్ చేస్తున్నయ్..

లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తు న్నం. ప్రతి పోలీస్ 24 గంటలూ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. సిటీలో 73 చెక్ పోస్టులు పెట్టాం . ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ అలెర్ట్ గా ఉంది. చెకింగ్ తో పాటు ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తు న్నం . డయల్ 100తో పాటు ట్విట్టర్ లో వచ్చే రిక్వెస్ట్ లతో పెట్రోలింగ్ సిబ్బందిని స్పాట్ కి పంపుతున్నాం. పోలీస్ కుటుంబాలు బాగా సపోర్ట్ చేస్తు న్నాయి. పోలీసులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా చెక్ చేయిస్తున్నం . – అంజనీకుమార్, సీపీ, హైదరాబాద్ 

మంచిగ పనిచేసినోళ్లను గుర్తిస్తం

మానవీయ కోణంలో సమాజ భద్రత కోసం డ్యూటీ చేస్తు న్న సిబ్బందికి అభినందనలు. రాష్ట్రంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తు న్నం . డ్యూటీలో ఉన్న పోలీసులకు అన్ని సదుపాయాలు కల్పిస్తు న్నం . హోంగార్డు స్థా యి అధికారి నుంచి ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఆరోగ్యశాఖ అందించే గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించాలి. కరోనా వైరస్ ను నివారించే క్రమంలో ప్రజా ఆరోగ్యంతో పాటు వ్యక్తి గత ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. జాతీయ స్థా యిలో మంచి పేరు తెస్తు న్న సిబ్బందికి లాక్ డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించే అవకాశం ఉంది. – ఎం. మహేందర్ రెడ్డి, డీజీపీ