కిషన్ రెడ్డికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

 కిషన్ రెడ్డికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.  ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో  ఏప్రిల్30  ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌లోని సిసియులో చేరారు. కార్డియాక్ కేర్ యూనిట్ లోని డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని,  ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సన్నిహితులు వెల్లడించారు. 

అంతకుముందు కిషన్ రెడ్డి ప్రధాని మోడీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పురస్కరించకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడిన పలు అంశాల అధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఈ గ్యాలరీని ప్రారంభించారు.