
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటరీ సోమవారమే నోటిఫికేషన్ జారీ చేశారు.
బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్దాఖలు చేసేందుకు గడువు ఉంది. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్కుమార్ఒక్కరే నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.