కాంగ్రెస్​ శ్రేణుల్లో జోష్​ నింపిన బైక్​ ర్యాలీ : వంశీకృష్ణ

కాంగ్రెస్​ శ్రేణుల్లో జోష్​ నింపిన బైక్​ ర్యాలీ : వంశీకృష్ణ

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన బైక్​ ర్యాలీ కాంగ్రెస్ ​శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్​ ఆధ్వర్యంలో తాండూరు మండలం కిష్టంపేట నుంచి ఐడీ వరకు భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వంశీకృష్ణ స్వయంగా బైక్​నడుపుతూ యూత్​ను ఎంకరేజ్​చేశారు.

 తాండూరు, అచ్చాలపూర్, కాసీపేట మండల కేంద్రం, దేవాపూర్​లో రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ ​అంబేద్కర్, కుమ్రం భీం విగ్రహాలకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ పూలమాలలు వేశారు. మహిళలు మంగళహారతులతో వారికి ఘన స్వాగతం పలికారు. 

డప్పు చప్పుళ్ల మధ్య రోడ్​ షోలు జరగ్గా కాంగ్రెస్ ​శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత, ప్రజలు, రైతులు బీఆర్​ఎస్ ​పాలనతో పడిన ఇబ్బందులు, కష్టాలను తన ప్రసంగాల్లో చెప్పుతూ వంశీకృష్ణ ప్రజల్లో ఆలోచన కలిగించారు. తానను ఎంపీగా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులతోపాటు, సమస్యలను తీర్చే తీరును వివరించారు.