బాధిత కుటుంబాన్ని..పరామర్శించిన వంశీకృష్ణ

బాధిత కుటుంబాన్ని..పరామర్శించిన వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు : చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్​కార్యకర్త కంకణాల దేవేందర్​రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్​యువనేత గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.

ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి గెలుపు కోసం దేవేందర్​రెడ్డి కష్టపడ్డాడని గుర్తుచేశారు. వంశీకృష్ణ వెంట కాంగ్రెస్​ లీడర్​హిమవంత్​రెడ్డి తదితరులున్నారు.