గడ్డం వెంకటస్వామి కళావతి స్మారక టోర్నీ ప్రారంభం

గడ్డం వెంకటస్వామి కళావతి స్మారక టోర్నీ ప్రారంభం

జైపూర్(భీమారం), వెలుగు : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భీమారం మండల కేంద్రంలో గడ్డం వెంకటస్వామి (కాక)– కళావతి స్మారక క్రికెట్ టోర్నమెంట్​ను స్థానిక ఎంపీటీసీ చేకుర్తి సరోజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ గల యువకులను ప్రోత్సహించేందుకు టోర్నీ నిర్వహిస్తున్నామని, క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

ఈ పోటీలు 15 రోజుల పాటు జరుగనున్నట్లు చెప్పారు. ఫైనల్‌ లో గెలిచిన జట్టుకు రూ.15 వేలు, రన్నరప్ ​టీమ్​కు రూ.10వేలతోపాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు చేకుర్తి సత్యనారయణ రెడ్డి, తైనేని రవి, సుధాకర్, అలకాటి తిరుపతి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.