గద్దర్​, సాయిచంద్​ లక్ష్యం ఒక్కటే : వెన్నెల

గద్దర్​, సాయిచంద్​ లక్ష్యం ఒక్కటే : వెన్నెల

దుబ్బాక, వెలుగు : ప్రజా గాయకులు గద్దర్, సాయి చంద్​ పాడిన పాటల్లో భావాలు వేరు కావొచ్చని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్​రజని, గద్దర్ ​కూతురు వెన్నెల అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన గద్దర్, సాయిచంద్ సంస్మరణ సభలో వారు మాట్లాడారు. గద్దర్​, సాయిచంద్​ఇక లేరన్న చేదు నిజాన్ని మరువలేకపోతున్నామని, వారికి జోహార్లు అంటుంటే తట్టుకోలేకపోతున్నామన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షను పాటల రూపంలో తెలియజేశారన్నారు. గద్దర్, సాయిచంద్​లపై ఏపూరి సోమన్న కళా బృందం పాడిన పాటలు అలరించాయి. వైస్ ఎంపీపీ అస్క రవి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, ఇల్లెందుల శ్రీనివాస్​, బత్తుల స్వామి, కూరపాటి బంగారయ్య, సర్పంచ్​ తౌడ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద చంద్ర సాగర్​, కో-ఆప్షన్​ సభ్యుడు ఆస స్వామి పాల్గొన్నారు.