V6 News

గద్దర్​ మరణం తీరని లోటు: కాంగ్రెస్​నేత మల్లు రవి

గద్దర్​ మరణం తీరని లోటు: కాంగ్రెస్​నేత మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: సమాజంలో అన్ని వర్గాల కోసం, సమాజ మార్పు కోసం పాటలు పాడిన గద్దర్​ మరణం తీరని లోటని పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటే ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న లేపిందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర,  భట్టి విక్రమార్క పాదయాత్రలోనూ గద్దర్​ పాల్గొన్నారని చెప్పారు. మంగళవారం గాంధీభవన్​లో మీడియాతో   ఆయన మాట్లాడారు. రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, రేవంత్​ సభల్లోనూ గద్దర్​ పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. సమాజం కోసం పనిచేసి కార్ల్​ మార్క్స్​ ఎలాగైతే మార్గదర్శకుడయ్యారో గద్దర్​ కూడా అలాగే చేశారన్నారు. గద్దర్​ చనిపోయిన రోజు నుంచి అంత్యక్రియలయ్యేదాకా అన్ని ఏర్పాట్లు రేవంత్, భట్టి విక్రమార్క తదితరులు పర్యవేక్షించారని తెలిపారు.