7న గద్దర్ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్

7న గద్దర్ అంత్యక్రియలు..  ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్

ప్రజా యుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రములకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ రంగానికి చెందిన పలువురు తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు.

సోమవారం అంత్యక్రియలు

సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియంలోనే గద్దర్ పార్థివదేహం ఉంచనున్నారు. 12 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగనుంది. గద్దర్ అంత్యక్రియలను అల్వాల్ మహాబోధి గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు

గద్దర్ పార్థివదేహానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నివాళులర్పించారు. గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.