
న్యూఢిల్లీ: హైదరాబాదీ స్టార్ షూటర్ గగన్ నారంగ్, రోయింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఏపీకి చెందిన రాజ్యలక్ష్మీ సింగ్.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వైస్ ప్రెసిడెంట్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ప్రెసిడెంట్గా లెజెండరీ పీటీ ఉష ఎన్నిక ఏకగ్రీవమైంది.
95 ఏళ్ల ఐవోఏ చరిత్రలో ఫస్ట్ ఒలింపియన్, ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అధ్యక్ష పదవి చేపట్టడం ఇదే తొలిసారి. శనివారం ఎన్నుకున్న 16 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్లో ఐదుగురు స్పోర్ట్స్ పర్సన్స్కు ప్లేస్ దక్కింది.