
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) 5వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఈ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ను దుబాయ్లో లాంచ్ చేశారు. రఘు కుంచె కంపోజ్ చేసి, పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ ‘ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహిస్తున్నాం.
బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్వినీ దత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితరులు అతిథులుగా హాజరుకానున్నారు. హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్తో పాటు పలువురు నటీనటులు పాల్గొనబోతున్నారు. హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు’ అని చెప్పారు.