గాంధీ ఆస్పత్రికి రూ. 50 లక్షల వైద్యపరికరాలు

గాంధీ ఆస్పత్రికి రూ. 50 లక్షల వైద్యపరికరాలు
  •     అందజేసిన పూర్వ విద్యార్థి

పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, తెలంగాణ డెవలప్​మెంట్​ఫోరం అమెరికా శాఖ అధ్యక్షుడు, సీనియర్​ గ్యాస్ర్టోఎంటరాలజీ డాక్టర్​ దివేశ్​అనిరెడ్డి రూ.50 లక్షల విలువైన మెడికల్​ఎక్విప్​ మెంట్​ను డోనెట్​చేశారు. గురువారం గాంధీ ఆస్పత్రి గ్యాస్ర్టో ఎంటరాలజీ డిపార్ట్ మెంట్​లో జరిగిన కార్యక్రమంలో డా.దివేశ్​అనిరెడ్డిని ఆస్పత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు

హెచ్ఓడీ డా. పి.శ్రావణ్​​ కుమార్​ అభినందించి, ఘనంగా సన్మానించారు.  అనంతరం దివేశ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం, వ్యవసాయం, స్కిల్​ట్రైనింగ్​రంగాల్లో తెలంగాణలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను  నిర్వహిస్తున్నామన్నారు.