పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డాక్టర్ జి.రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు. ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్ బాడీని వైద్య పరిశోధనల కోసం అనాటమీ విభాగానికి కుటుంబ సభ్యులు డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సంతాపం ప్రకటించారు.
