వన్ పర్సెంట్ కూడా వృథా కాకుండా మెప్పిస్తుంది

వన్ పర్సెంట్ కూడా వృథా కాకుండా మెప్పిస్తుంది

బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని జంటగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’.  ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా గురువారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. హీరో గణేష్ మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్, టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలిసి ప్యాషన్‌‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి టీమ్‌‌కి సక్సెస్ వస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. 

థియేటర్‌‌‌‌కి వచ్చిన ఆడియెన్స్ థ్రిల్ ఫీలవుతారు. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఉంటుంది’ అని చెప్పాడు. ‘టికెట్‌‌కు పెట్టిన డబ్బు, రెండు గంటల సమయం వన్ పర్సెంట్ కూడా వృథా కాకుండా మెప్పిస్తుంది’ అన్నాడు దర్శకుడు రాకేష్.  ‘ఎంటర్​టైన్​మెంట్, థ్రిల్ ఉంటుంది. అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత చెప్పారు. కథను అందించిన కృష్ణ చైతన్య, నటులు రవి శివతేజ, ఆటో రాంప్రసాద్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.