
తెలుగు రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జనం పూర్తైంది. ఖైరతాబాద్ మహా గణపతిని ఉత్సవ కమిటీ నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సాయంతో.. భక్తుల నినాదాల మధ్య.. బడా గణేశ్ ను గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి సారిగా భక్తులు లంబోదరుడిని దర్శించుకున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న భారీ విగ్రహాన్ని పెద్ద క్రేన్ తో నెమ్మడిగా ఎత్తి.. హుస్సేన్ సాగర్ లో వదిలారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం 1 .30 నిమిషాలకు కొనసాగింది.
మధ్యాహ్నం 2 గంటల సమయానికే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యింది. లక్షల మంది భక్తులు.. బై బై గణేషా అంటూ వీడ్కోలు పలికారు. మహా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అపూర్వ ఘట్టాన్ని కోట్ల మంది టీవీలు, ఆన్ లైన్ ద్వారా వీక్షించారు. గణేష్ నవరాత్రుల్లో కోట్ల మంది భక్తులను దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ గణేషుడు.. ఈ ఏడాదికి బై బై చెప్పారు..