లండన్ లో ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

లండన్ లో ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

లండన్ లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 8వ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లండన్ కు సమీపంలోని రీడింగ్ నగరంలో విత్తన గణపతిని ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. హైఫై ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అధ్యక్షులు దూసరి అశోక్ గౌడ్. కరోనా కారణంగా ఈసారి వేడుకలను సాదాసీదాగా నిర్వహించామన్నారు. కరోనా నింబంధలను పాటిస్తూ తొమ్మిది రోజులపాటు పూజలు, హోమాలు నిర్వహించామన్నారు. చివరిరోజు ఇంటి ఆవరణలోని తొట్టిలో గణపతి నిమజ్జనం చేశామని తెలిపారు.