
- సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా
ఆర్మూర్, వెలుగు: శాంతియుతంగా గణేశ్ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. శుక్రవారం ఆర్మూర్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులు, కుల సంఘాల పెద్దలు, నాయకులతో శాంతి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గూండ్ల చెరువు వద్ద మినీ ట్యాంకు బండ్ పనులు జరుగుతున్నందున పది ఫీట్ల లోపు విగ్రహాలే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. డీజే సౌండ్ సిస్టమ్కు అనుమతి లేదని చెప్పారు. ఏఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యానారాయణ, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.