రోహింగ్యాలను వెనక్కి పంపాలి : రాఘవ్‌రెడ్డి

రోహింగ్యాలను వెనక్కి  పంపాలి :  రాఘవ్‌రెడ్డి
  •     గణేశ్ ​ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ్‌రెడ్డి

ఓల్డ్‌ సిటీ, వెలుగు: సిటీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి ఖాళీ చేయించాలని గణేశ్​ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 26 కాలనీల్లో 6,993 మంది చొరబాటుదారులు ఉన్నారని తెలిపారు. శనివారం గణేశ్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్​లో ధర్మరక్షణ సభ నిర్వహించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేసి వారిని వారి దేశాలకు పంపాలని కోరారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, మాజీ మంత్రి చిన్నబోయిన కృష్ణ యాదవ్, గుజరాత్‌కు చెందిన హిందూ పీఠాధిపతి గౌరేంద్ర సరస్వతి స్వామి తదితరులు పాల్గొన్నారు.