- పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
- న్యాయం చేయాలని పీఎస్ వద్ద ధర్నా
జీడిమెట్ల, వెలుగు: గంజాయి బ్యాచ్ నుంచి తమను రక్షించాలంటూ జీడిమెట్ల పీఎస్ వద్ద పలువురు కాలనీ వాసులు ధర్నా చేశారు. ఎన్ఎల్బీ నగర్లోని హనుమాన్ టెంపుల్ వద్ద కల్యాణ్ (20), సంఘీ (20) అనే ఇద్దరు సోమవారం రాత్రి గంజాయి సేవిస్తున్నారు. స్థానిక మహిళలు వారించడంతో దాడి చేశారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
రోజురోజుకు కాలనీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని, ప్రాణభయం ఉందన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో కూర్చుని నినాదాలు చేశారు. స్థానికులు ఫిర్యాదు చేసిన ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు.
