పేట్బషీరాబాద్లో భారీగా డ్రగ్స్

పేట్బషీరాబాద్లో భారీగా డ్రగ్స్

 

  • 200 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల ఓపీఎం పట్టివేత
  • బాచుపల్లిలోనూ 12 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ తెచ్చి నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పేట్​ బషీరాబాద్​, బాచుపల్లి పోలీస్​స్టేషన్ల  పరిధిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్​ పట్టుబడింది. రాజస్థాన్‌ నాగౌర్‌ జిల్లా ఖేడ్‌ నార్నోనియా గ్రామానికి చెందిన రాజేందర్‌(31) హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. రాజస్థాన్‌ నుంచి నగరానికి వచ్చే కొంతమంది ఎండీఎంఏ, ఓపీఎం ఎక్కువగా వాడుతున్నట్లు గమనించి ఆ బిజినెస్​లోకి దిగాడు. 

రాజస్థాన్​లోని ధన్‌రాజ్‌, అనీల్‌ మోహన్‌రామ్‌, ముఖేశ్‌జాట్‌, పునమ్‌ బిషోనాయ్‌ అలియాస్‌ విష్ణు నుంచి డ్రగ్స్‌ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా బుధవారం పేట్​ బషీరాబాద్​లోని అంగడిపేటలో అతడు ఉంటున్న ఇంటిపై ఈగల్​ టీం, పేట్​ బషీరాబాద్​ పోలీసులు దాడులు చేశారు. రూ.15 లక్షల విలువైన 200 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల ఓపీఎం స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

బాచుపల్లిలో ముగ్గురు అరెస్ట్..

మల్లంపేట్​లోని హైరైజ్​ విల్లాస్​లో నివాసముండే హర్ష(31) వద్ద డ్రగ్స్​ ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. 1.12 గ్రాములు ఎండీఎంఏ దొరికింది. అంతేగాకుండా బెంగళూరుకు చెందిన నిన్​జప్ప(32)  బెంగళూర్​ నుంచి ఎండీఎంఏ తీసుకువచ్చి హర్ష డ్రైవర్​ చందు(21)కు ఇస్తుండగా పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడి వద్ద నుంచి 11.34 గ్రాముల ఎండీఏంఏ స్వాధీనం చేసుకున్నారు.