టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

గన్నవరం టీడీపీలో విషాదం నెలకొంది. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత 30 రోజుల నుండి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు స్వగ్రామం మచిలీపట్నం. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు అనేక పదవులు చేసి.. ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈనెల 25 వరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. గత 3 సంవత్సరాల నుండి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు బచ్చుల అర్జునుడు. గుండె సంబంధిత వ్యాధితో... 30 రోజుల నుండి విజయవాడ రమేష్ హాస్పిటల్‭లో ఆయన కోమాలో ఉన్నారు. బచ్చుల అర్జునుడు మృతి పట్ల బీసీ సామజిక వర్గం, గన్నవరం టీడీపీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.