
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్ వద్ద నటి అక్కినేని అమల, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్ వెంకటేశ్ ధోత్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లను క్లీన్ చేసి, చెత్త కుప్పలను బ్యాగుల్లో వేసి స్వచ్ఛ వెహికల్స్ ద్వారా కలెక్షన్ ట్రాన్స్ ఫర్ పాయింట్లకి పంపించారు.
పద్మారావునగర్: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సిటీలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మహమ్మద్ గూడలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆస్పత్రి వార్డులు, బయట పరిశుభ్రత పనులను వైద్య సిబ్బంది నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. ఎలిజబెత్ రాణి, ఆశ కార్యకర్తలు ఉమా పాల్గొన్నారు.
ముషీరాబాద్: పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో ఎంపీ లక్ష్మణ్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ సీనియర్ నేతలు గోపాల్ రెడ్డి, రత్న సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్: తార్నాక చింతల్ అంబేద్కర్ విగ్రహం నుంచి తార్నాక చౌరస్తా వరకు జరిగిన శ్రమదాన్ ప్రోగ్రాంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతలు చంద్రారెడ్డి, శివారెడ్డి, వీరన్న, సంపత్తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ : మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ విప్ తోకల శ్రీనివాస్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
మెహిదీపట్నం: గుడిమల్కాపూర్ డివిజన్లోని స్వామి వివేకానంద విగ్రహం కూడలి వద్ద గుడిమల్కాపూర్ డివిజన్ యువ నేత దేవర వంశీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులను సన్మానించారు.
గండిపేట్: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల వలంటీర్లు 200 మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు.