న్యూఢిల్లీ: భారత టెస్ట్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ను తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కోచ్ మార్పు వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. టెస్ట్ కోచ్గా గంభీర్ను తొలగిస్తారని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు.
రెడ్-బాల్ కోచింగ్ సెటప్లో మార్పు గురించి బీసీసీఐ ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ కొనసాగుతాడని తేల్చిచెప్పారు. టెస్ట్ కోచ్ కోసం గంభీర్ స్థానంలో బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదని వివరించారు. కాగా, స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో రెడ్ బాల్ కోచ్ పదవి నుంచి గంభీర్ను తొలగించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
►ALSO READ | సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్: ఫైనల్లో సాత్విక్–రాధిక
గంభీర్ స్థానంలో తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను టెస్ట్ కోచ్గా నియమించనున్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోచ్ మార్పు వార్తలు పుకార్లేనని బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ ఇవ్వడంతో ప్రచారానికి చెక్ పడింది. టెస్ట్ కోచ్గా గంభీర్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడింది.
