గీతంలో ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

గీతంలో ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న టెక్ ఫెస్ట్​ జోనల్స్​ 2025 సోమవారం విజయవంతంగా ముగిసింది. ఐఐటీ బాంబే సహకారంతో ఆసియాలోనే అతిపెద్ద సైన్స్​ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ జోనల్స్​కు గీతం ఈఈసీఈ విభాగం, జీ ఎలక్ర్టా ప్రాతినిథ్యం వహించాయి. వివిధ విభాగాల్లో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. 

కోడ్​ కోడ్​, మెష్ మెరైజ్​, కోజ్మో క్లెంచ్​, టీఎఫ్​వో లాంటి నాలుగు ఎడిషన్లలో విద్యార్థులు తమ నైపుణ్యాలను జాతీయ వేదికకు అందించారు. గీతంకు చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు, 40 మంది స్టూడెంట్ వలంటీర్లు మరో ఇద్దరు టెక్నాలజీ ప్రొఫెషనర్ల సమన్వయంతో దాదాపు 400 మంది విద్యార్థులు ఈ ఫెస్ట్​లో పాల్గొన్నారు. స్కూల్​ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్​ వీఆర్​శాస్ర్తీ, ఈఈసీఈ హెడ్​ ప్రొఫసర్​ మాధవీలత, నరేశ్ కుమార్​, బాలాజీ, గౌరీశంకర్​, వేణు రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.