హైదరాబాద్, వెలుగు : నెక్ట్స్జీన్ సీక్వెన్సింగ్ ద్వారా రోగికి పర్సనలైజ్డ్ కేర్ అందించే 'జెనీ కనెక్ట్ ఆర్ఎక్స్' ను ఏఐజీ హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్, చీఫ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో శుక్రవారం ప్రారంభించారు. ఇది ఉప్పలూరి గ్రూప్లో భాగమైన డయాగ్నస్టిక్ వింగ్ జీన్పవర్ ఆర్ఎక్స్ లో ఒక వినూత్న ఏఐ ప్లాట్ఫారమ్. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో పర్సనలైజ్డ్ మెడిసిన్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
ప్రతి ఒక్కరికీ కచ్చితమైన, సమర్థవంతమైన, సరసమైన పర్సనలైజ్డ్ డ్రగ్స్ను అందించడం అనేది కీలకం అన్నారు. జెనీ కనెక్ట్ ఆర్ఎక్స్ వల్ల భవిష్యత్లో వచ్చే వ్యాధులను ముందే గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాధుల చికిత్సకు అనువైన ఆహారాన్ని, వ్యాయామాన్ని, మందులను సూచిస్తారు. సైడ్ఎఫెక్ట్స్ను గుర్తిస్తారు.