
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రధాన పూజారి(కటోడా) మెస్రం కోసు(72) మృతిచెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెస్రం కోసు స్వగ్రామం గాదిగూడ మండలం బొడ్డిగూడలో శనివారం జరిగిన అంత్యక్రియలకు మెస్రం వంశస్థులతో పాటు ఆదివాసీ పెద్దలు, ఆయా గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.