- 1,750 చర్చిలకు పెయింట్తో పాటు లైటింగ్ ఏర్పాటు
- నిధుల కోసం 15లోపు దరఖాస్తు
హైదరాబాదక సిటీ, వెలుగు: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బల్దియా సిద్ధమైంది. గ్రేటర్ విలీన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడంతో ప్రస్తుతానికి రూ.2 కోట్లతో ఇదివరకు ఉన్న 150 డివిజన్లలో ఉత్సవాలు జరపనుంది. ప్రతి డివిజన్కు ఒక చర్చి, నియోజకవర్గానికి రెండు చర్చిలతో మొత్తం 198 చర్చిల్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, భోజనాలతో వేడుకలు నిర్వహించనుంది.
అలాగే గ్రేటర్లోని నియోజకవర్గానికి 75 చర్చిల చొప్పున మొత్తం 1750 చర్చిలకు పెయింటింగ్ వేయడంతో పాటు డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేయనుంది. నిధుల విడుదల కోసం చర్చిల పాస్టర్లు లేదా స్థానికులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక విలీనమైన 27 లోకల్ బాడీల్లో ఎప్పటిలాగే ఆయా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది క్రిస్మస్ ఉత్సవాలను నిర్వహించనున్నారు.

