కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఫ్యామిలీకి పరిహారం

కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఫ్యామిలీకి పరిహారం

హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల బాలుడు ప్రదీప్  కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ రూ. 8లక్షలు,అలాగే కార్పొరేటర్ల నెల జీతం రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు  ఇవ్వాలని నిర్ణయించింది. మరో వైపు నగరంలో వీధి కుక్కల బెడదపై నివారణకు కమిటీ వేయాలని తీర్మానించింది.

ప్రదీప్ మృతి చెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటగా తీసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో  చెప్పాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 16  కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.