గ్రేటర్ లో మొదలైన్ల నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్ లో మొదలైన్ల నామినేషన్ల ప్రక్రియ

జీహెచ్ఎంసీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇవాళ్టి నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.  నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికీ మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్ లోకి అనుమతిచ్చారు. నగరంలో  జీహెచ్ఎంసీ సిబ్బంది ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తున్నారు. దీని కోసం  20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం. నిన్న ఒక్క రోజే దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగించారు.