
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్, డెత్సర్టిఫికెట్ల జారీకి చెక్ పడనుంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీ ఆర్ ఎస్) ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం జీహెచ్ఎంసీ లేఖ రాయగా, ఇందుకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబరితి ఆమోదించారు. ఈ అంశంపై ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్, సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సిస్టమ్కు అనుమతి ఇస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో డైరక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి దేశవ్యాప్తంగా ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఓఆర్ జీఐ) ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ పోర్టల్ లో మైగ్రేన్ కానుంది. ఆ తరువాత సీఎస్ఆర్ ద్వారా సర్టిఫికెట్లు జారీ కానున్నాయి.