జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల బదిలీ

జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ రెవెన్యూ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తూ మెటర్నిటీ లీవ్​తీస్కున్న స్నేహాశబరీశ్ 180 రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. కమిషనర్​ఆర్వీ కర్ణన్​ఆమెకు అడ్వర్ టైజ్ మెంట్ విభాగం అడిషనల్​కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్​కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సుభద్రాదేవికి ఆ బాధ్యతలు తప్పించి, యూబీడీ ఇన్​చార్జి అడిషనల్​కమిషనర్ గా నియమించారు.

అడ్వర్ టైజ్ మెంట్ విభాగం అడిషనల్​కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించిన వేణుగోపాల్ రెడ్డికి ట్రాఫిక్, స్ట్రీట్ లైట్ల విభాగాలను అప్పగించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించిన అన్ని ఫైళ్లు అడిషనల్​కమిషనర్​ద్వారానే వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.